SKLM: నరసన్నపేటలోని మార్కెట్లో ఉంటున్న బరాటం సురేశ్ కుమార్ గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈయన కిరాణా మర్చంట్గా కొనసాగుతున్నారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.