E.G: కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను తనిఖీ చేయడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్, ఆర్డీవో ఆర్.కృష్ణ నాయక్లతో కలిసి పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల భద్రతపై క్రమం తప్పకుండా తనిఖీ చేస్తామన్నారు.