ATP: ఆత్మకూరు మండలం పంపనూరు తండాలోని నూతనంగా వెలసిన శ్రీ కాళికామాత ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి రావాలని ప్రజలను ఆహ్వానించారు.