ATP: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠిక పఠనం కార్యక్రమం అనంతపురంలోని SSBN కళాశాలలో ఐద్వా, SFI ఆధ్వర్యంలో శనివారం జరిగింది. జాతీయ జెండాను చేత పట్టి, రాజ్యాంగ పీఠిక పఠనం, ప్రమాణాన్ని ప్రతిజ్ఞ చేశారు. భారతదేశంలో కులాలకు, మతాలకు, ప్రాంత, వర్గ, భాష భేదాలు లేకుండా భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు సంక్రమించిందన్నారు.