సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బుధవారం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ. 18,61,000 ల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.