ATP: గుత్తి కోట రైల్వే స్టేషన్లో శనివారం ఆటో కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని IOW నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ మేనేజర్ రాంబాబు నిర్వహించారు. గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే, మున్సిపల్ అధికారులు, సంరక్షణ సమితి సభ్యులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.