ATP: జాతీయ ఏకత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఎస్పీ పీ.జగదీష్ నివాళులర్పించారు. దేశాన్ని ఏకతాటిపై నడిపించిన పటేల్ సేవలు ప్రశంసనీయమని, స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన పోలీసు సిబ్బందికి, విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు.