బాపట్ల: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్లె పట్టణ 2వ వార్డులో శనివారం ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చి ప్రారంభోత్సవ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు మహేష్ ఉన్నాడు.