SKLM: మంచి ఆరోగ్యాభివృద్ధికి క్రీడలు చాలా అవసరం అని పాతపట్నం ఎస్సై కె.మధుసూదనరావు అన్నారు. పాతపట్నం మార్కెట్ యార్డ్ యందు షటిల్ స్టార్స్ ఆధ్వర్యంలో మంగళవారం బాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 9 టీములు పాల్గొనగా గెలుపొందినవారు సి.హెచ్. దుర్గారావు, సుధీర్ ప్రసాద్, కృష్ణ ప్రథమ, ద్వితీయ స్థానం విజేతలకు ఎస్సై టోపీలు అందజేశారు.