కోనసీమ: కూటమి ప్రభుత్వ 100 రోజుల పరిపాలన ప్రజారంజక పాలన దిశగా అడుగులు వేస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. పడమటిపాలెంలో సర్పంచ్ మాధవి అధ్యక్షతన నిర్వహించిన ప్రజావేదిక సమావేశంలో MLA మాట్లాడారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, తాగు, సాగునీరు, విద్య, వైద్యం, తదితర రంగాలు నిర్లక్ష్యం చేశారన్నారు.