BHNG: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం అడ్డగూడూరు కేజీబీవీ పాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా రోగనిరోధక అధికారి డా. రామకృష్ణ, ఆర్బీఎస్కే డా. శ్రీకాంత్ సమన్వయంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులకు స్పెషలిస్ట్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.