SRCL: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 33వ వార్డులో 100 శాతం ఇంటి పన్ను వసూలైంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ కొండ వర్షిణి- నరేష్లను, వార్డు ఆఫీసర్ అలేఖ్యను మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా-చక్రపాణి, మున్సినల్ కమీషనర్ ఎండీ ఖాదిర్ ఫాషా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈ వాణి, రెవెన్యూ ఆఫీసర్ రామ్మోహన్ రాయ్, తదితరులు పాల్గొన్నారు.