India enter in to semis after winning against Sri Lanka by 302 runs
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో 33వ మ్యాచ్ శ్రీలంకతో జరుగగా..భారత ఆటగాళ్లు అదరగొట్టి విజయం సాధించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ గ్రాండ్ గా గెలిచి టీమిండియా సెమీఫైనల్ దూసుకెళ్లింది. అయితే మొదట టాస్ గెల్చిన లంక ఆటగాళ్లు బౌలింగ్ ఎంచుకున్నారు. ఆ క్రమంలో ఆటకు దిగిన భారత ఆటగాళ్లలో ప్రధానంగా శుభ్మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 రన్స్ చేయగా..భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఆ క్రమంలో లంక బౌలర్లలో కేవలం దిల్షాన్ మధుశంకనే 6 వికెట్లు తీయడం విశేషం.
ఇక తర్వాత 358 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన లంక ఆటగాళ్లు మొదటి నుంచి బిక్కు బిక్కు మంటూ ఆడసాగారు. ఆ క్రమంలో భారత భౌలర్లు దీటుగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక జట్టు 55 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో భారత బౌలర్లైన మహ్మద్ షమీ 5, మహ్మద్ సిరాజ్ 3, జస్ప్రీత్ బుమ్రా 1, జడేజా 1 వికెట్ తీసి అద్భుతమైన బౌలింగ్ వేసి భారత జట్టు అద్భుతమైన గెలుపునకు తోడ్పాటునందించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ తిరుగులేని జట్టుగా ఆరు విజయాలు సాధించింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానంలోకి టీమిండియా మళ్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇదే జోరును టీమిండియా కొనసాగిస్తే ఈసారి వరల్డ్ కప్ టైటిల్ మనదేనని చెప్పవచ్చు.
ఇది కూడా చూడండి: Shubman Gill: సెంచరీ మిస్..సారా టెండూల్కర్ రియాక్షన్ వైరల్

