NLG: తెలంగాణలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాలలో రాక్ డ్రిల్లింగ్ యూనియన్ మంగళవారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించింది. వడ్డెరలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడ్డారని పేర్కొన్నారు. హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు శివరాత్రి వెంకటేష్, రూపని రాజు, విజయ్ కుమార్, వరికుప్పల వెంకటేష్ పిలుపునిచ్చారు.