NRML: రామ్రావుబాగ్లో శ్రీ ఆంజనేయ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం మంగళవారం ఎన్నికైంది. వార్డు కౌన్సిలర్ రామోజీ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అమృత్ అశోక్ పటేల్, ఉపాధ్యక్షులుగా ఆడేలు, రామ్ నరేష్, కార్యదర్శులుగా జనార్ధన్, విజయ్, కోశాధికారులుగా చేనీ దానయ్య, బార్ల సుభాష్ ఎంపికయ్యారు. వీరిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.