AKP: కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి ‘ఖేలో ఇండియా’ రగ్బీ పోటీల్లో జిల్లా జట్లు ప్రతిభ కనబరిచాయి. సీనియర్స్ జట్టు ద్వితీయ స్థానం, జూనియర్స్ జట్టు తృతీయ స్థానం సాధించాయి. లీగ్ దశలో వరుస విజయాలతో ఫైనల్, సెమీఫైనల్ వరకు చేరినట్లు కోచ్ వెంకట్ తెలిపారు. జట్ల ప్రదర్శనపై అధ్యక్షుడు కుండ్రపు వెంకునాయుడు, అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులను అభినందించారు.