NRPT: మద్దూర్ మండలం బండగోండలో జరిగిన బీపీఎల్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన బండగోండ జట్టు సభ్యులు తమ ఉదారతను చాటుకున్నారు. పోటీలో గెలుచుకున్న రూ.10 వేల బహుమతి మొత్తాన్ని తలసేమియాతో బాధపడుతున్న చిన్నారి ప్రసన్న వైద్య ఖర్చుల కోసం అందజేశారు. క్రీడాస్ఫూర్తితో పాటు మానవత్వాన్ని చూపిన జట్టు సభ్యులను గ్రామస్థులు అభినందించారు.