GNTR: రంజాన్ పండుగ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు శుక్రవారం పారిశుద్ధ్య తనిఖీలు చేపట్టారు. మసీదుల పరిసరాల్లో వ్యర్థాలు లేకుండా చూడాలని, డ్రైనేజీలు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగ వేళ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య విభాగం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.