BHNG: అమ్మాయిలు చదువులో ముందంజలో ఉండడంతోనే ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని ఆలేరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు నోముల భారతమ్మ అన్నారు. ఆలేరు ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ కేంద్రంలోని వీ.ఆర్.జూనియర్ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఉపాధ్యాయురాలు వడ్డెమాను రాణిలతో కలిసి పాల్గొన్నారు.