తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. నటి ముచ్చర్ల అరుణ, దర్శకుడు గోపీచంద్ మలినేని, బాబీ సింహా, తమన్, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ తదితరులు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు వేదాశీర్వచనం చేసి.. తీర్థప్రసాదాలను అందజేశారు.