ADB: ఆదిలాబాద్ కోలాం ఆశ్రమ బాలుర పాఠశాలలో డాక్టర్ సర్ఫరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం అంకోలి వైద్య బృందం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సురేష్, ఈశ్వర్ రెడ్డి, ప్రేమ్ సింగ్, ముయ్యాల మోతి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.