చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. OTTలో కూడా ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ని సొంతం చేసుకుంది. ఇక యువ నటీనటులు అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని సాయిలు కంపాటి తెరకెక్కించాడు.