VSP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఎలమంచిలి సమీపంలో మంటలు రావడాన్ని లోకో పైలట్లు గుర్తించి వెంటనే రైలును ఆపేశారు. అనకాపల్లి నుంచి బయల్దేరిన తర్వాత నర్సింగబల్లి వద్ద మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఎం2 బోగీకి అగ్నికీలలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు రెండు బోగీలు కాలిపోయాయి.