ప్రకాశం: తర్లుపాడులోని సూరేపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ.. కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.