మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండలో ఎస్పీ జానకి ఆదివారం పర్యటించారు. మండలంలోని కోయిలకొండ, సంగిలోనిపల్లి, ఎల్లారెడ్డిపల్లి, మోదీపూర్,షేర్ వెంకటాపూర్,సూరారం, ఖాజీపూర్ గ్రామాలలోని సమస్యత్మక కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సై తిరుపాజిని ఆదేశించారు.