AP: ఏలూరు జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. తర్వాత నల్లమాడ ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.