MBNR: గిరిజన అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మంగళవారం బాలానగర్ మండలంలోని గుండిడ్ గ్రామపంచాయతీ కుమ్మరి కుంట తండాలో నిర్వహించిన తుల్జా భవాని పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు.