SRD: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకుని మంగళవారం నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం దారుణమని చెప్పారు.