MDK: కొల్చారం మండలం ఏడుపాయల సమీపంలో అత్యాచారానికి గురై అపస్మారక స్థితిలో గుర్తించిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మెదక్ మండలానికి చెందిన 35 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్వారక స్థితిలోకి వెళ్ళగా చీరతో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం గుర్తించి ఆసుపత్రికి తరలించారు.