PDPL: గోదావరిఖని గాంధీ చౌరస్తా నుంచి రీగల్ షూ మార్ట్ చౌరస్తా వరకు, లక్ష్మీనగర్ ఏరియాలోని వ్యాపారులకు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సీహెచ్. శ్రీనివాస్ సూచనలు చేశారు. వాహనాలు రోడ్ల మీద నిలపకూడదని షాపుల యాజమానులకు సూచనలు చేశారు. రోడ్లపై వాహనాలను నిలిపితే జరిమానాలు విధిస్తామని సూచించారు. వాహన యాజమానులు షాపుల ముందు నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలన్నారు.