MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని డీఎంహెచ్వో రవి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్లో ఉన్న అవుట్ పేషెంట్ విభాగం, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అందించే వైద్య సేవల ధరల వివరాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని అన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.