BDK: ఆదివాసి గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యాలు లేక గర్భిణీలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ పరిధిలో సుందరయ్యనగర్ గ్రామంలో జ్యోతి అనే గర్భిణీని మంచానికి కట్టి మోసుకొని వస్తున్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.