VZM: చీపురుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండవ రోజు బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు తల్లికి అలంకరణ చేపట్టి వైభవంగా పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల అన్ని రోజులు సామూహిక కుంకుమార్చనలు ఉంటాయని భక్తులు పాల్గొవచ్చని ఈవో బి. శ్రీనివాస్ తెలిపారు.