సత్యసాయి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు తప్పులేని ఓటరు జాబితా, యువత ఓటు నమోదు, పోలింగ్ శాతం పెంపు కోసం సహకరించాలని కోరారు. 23 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో BLOలు ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్ల వివరాలు సేకరించనున్నారు.