AKP: ఎలమంచిలి మండలం తెరువుపల్లిలో చీటీలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసిన డి.పైడియ్య మోసంచేసి పరారైనట్లు బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన పైడియ్య పాలసేకరణ కేంద్రంలో వేతన కార్యదర్శిగా పనిచేస్తూ చీటీలు నిర్వహించడంతో పాటు అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ప్రజలను మోసం చేసినట్లు వారు తెలిపారు.