MBNR: జులై నుంచి ఫేస్ క్యాప్చర్ ద్వారా పింఛన్ల పంపిణీ ఉంటుందని ఇందుకు ప్రత్యేక యాప్ను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో పింఛన్లపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ విధానంతో అర్హులైన వారందరి పింఛన్లు అందుతాయన్నారు. 3 నెలల నుంచి పింఛన్ తీసుకోని వారిని వెంటనే గుర్తించి విచారణ అనంతరం తొలగించాలన్నారు.