KMR: గాంధారి పీహెచ్సీలో అమ్మ ఒడి కార్యక్రమం సోమవారం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డా.సాయి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు తెలిపారు. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.