NLG: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు పత్తి రైతులకు శాపంగా మారాయి. పక్షం రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో వేలాది ఎకరాలలో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాలలో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జూన్ మొదటి వారంలో కురిసిన మోస్తారు వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 50ల ఎకరాలలో పత్తి నాటారు.