ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విచారణకు గైర్హాజరు అయ్యారు. పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్, ‘చలో పేరూరు’ ఘటనల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 20న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా హాజరుకాలేదు. దీంతో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.