మంచిర్యాల: దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి రాజయ్య శనివారం మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు కరీంనగర్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. తాళ్లపేట గ్రామానికి రాజయ్య మొదటి ఎంపీటీసీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు.