BDK: పర్యావరణ హితంగా మట్టి ఇటుకలు తయారు చేసి బహుమతులు గెలుచుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సండే బ్రిక్స్ ఛాలెంజ్ పేరుతో జిల్లా యంత్రాంగం వినూత్నంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈనెల 22న కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహిస్తున్నారు. బెంగళూరు సీఎస్ఈబీ నిపుణులు సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగునున్నట్లు పేర్కొన్నారు.