NGKL: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణపై జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులతో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు కావలసిన భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టపరిహారం పంపిణీ, ప్రాజెక్టుల నిర్మాణంలో భూ సేకరణ ఆలస్యం కాకూడదని అన్నారు.