KKD: కలెక్టరేట్లో ఈనెల 9న సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు అందజేయడానికి ఎవరూ కార్యాలయానికి రావద్దని సూచించారు.