W.G: మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని మైత్రి కాలనీస్ వెల్పేర్ & డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వినాయక పత్రిమాలు, వ్రత పూజ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.