NDL: మహానంది మండలం సీతారామపురం గ్రామ సమీపంలోని నంద్యాల – గాజులపల్లె జాతీయ రహదారి వద్ద ఆటోను లారీ ఢీ కొందని స్థానికులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున గ్రామ సమీపంలో ప్రయాణికులను ఎక్కించుకొని నంద్యాలకు వెళుతున్న సమయంలో గిద్దలూరు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడటంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.