KKD: తుని పట్టణంలో కూటమి నాయకులు స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్, MLA యనమల దివ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం ప్రపంచానికి తన సత్తా చాటిందని దివ్య తెలిపారు. తీవ్రవాదులపై జరిగిన పోరులో విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సైనికుల నిస్వార్థ దేశ సేవను కొనియాడారు.