KKD: సామర్లకోట నుంచి అచ్చంపేట వరకు నిర్మిస్తున్న హైవే నిర్మాణ పనుల్లో భాగంగా బ్రిడ్జిలకు గడ్డర్లు లేపుతున్న నేపథ్యంలో ఈనెల 21 నుంచి 24 వరకు సామర్లకోట- కాకినాడ కెనాల్ రోడ్డు ట్రాఫిక్ మళ్లించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం తెలిపారు. అచ్చంపేట జంక్షన్లో బ్రిడ్జి పనులకు సంబంధించి ఈనెల 27, 28 తేదీల్లో రాత్రి సమయంలో ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందన్నారు.