ప్రకాశం: త్రిపురాంతకం మండలం గొల్లపల్లికి చెందిన నేతాజికి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై శివ బసవరాజు తెలిపారు. పాకిస్థాన్ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని మార్కాపురం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.