KRNL: బెంగళూరుకు చెందిన రాఘవేంద్ర స్వామి భక్తుడు, భాజపా నాయకుడు శ్రీమఠానికి రూ.2 లక్షలు విరాళంగా అందజేసినట్లు మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. శనివారం ఆయన మంత్రాలయం చేరుకుని గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శించుకున్నారు. అనంతరం అన్నదానానికి రూ.లక్ష, శాశ్వత సేవకు రూ.లక్ష చొప్పున చెక్కును అందించినట్లు మేనేజర్ పేర్కొన్నారు.