ASR: డుంబ్రిగుడ మండల కురిడి సమీపంలోని చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై పాపినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోగిలికి చెందిన కే.నాగేశ్వరరావు అనే గిరిజనుడు కనిపించడం లేదని ఈనెల 2న స్థానిక పోలీస్ స్టేషన్లో వారి బంధువులు ఫిర్యాదు చేశారని తెలిపారు. శనివారం కురిడి సమీపంలోని ఆయన మృతదేహం లభ్యం అయిందన్నారు.