KRNL: కోడుమూరు పట్టణంలో ముక్కుపచ్చలారని శిశువు మృతదేహం బకెట్లో శనివారం లభ్యమైంది. మగ బిడ్డకు జన్మనిచ్చి శిశువును బకెట్లో విడిచి వెళ్లిన సంఘటన స్థానిక సంత మండలం మార్కెట్ సమీపంలోని పాఠశాల వద్ద వెలుగు చూసింది. నెలలు నిండని శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని శిశువు మృతదేహానికి ఆసుపత్రికి తరలించారు.